కాగా ఈసారి ఆయన భంగపడకుండా, అభిమానులను బెంగపెట్టకుండా గెలుస్తారా? లేదా? అని జనసైనికులు ఆయన జాతకం చూడడం మొదలు పెట్టారు. అయితే ఆయన జాతకం చూసిన కొంతమంది పవన్ గాలి ఈసారి గట్టిగా వేయబోతుందని జోశ్యం చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ కలిగిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పెద్దగా ప్రభావితం చూడలేకపోవడం జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు. అయితే ఈసారి వారి ఆకలి తీరనుందనే పుకారు షికారు చేస్తోంది సోషల్ మీడియాలో.
ఇక అదే వరుసలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిలుస్తారు. ఈయన జాతకం కూడా కాంగ్రెస్ నాయకులు చూసినట్టు భోగట్టా. అయితే ఈసారి రాహుల్ గాంధీకి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయని ఓ అంచనాకి వస్తున్నారు ఆయన అభిమానులు. ఇక చివరగా ఈ లిస్టులోకి నారా చంద్రబాబు, లోకేష్ చేరారు. ఏపీలో త్వరలో రాబోయే ఎన్నికల్లో తండ్రీ కొడుకులు తమ ఉనికిని తప్పకుండా చాటుకుంటారు అని ప్రముఖ జ్యోతిష్యుడు అంగదానంద శాస్త్రి ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. మరి కొన్ని రోజుల్లో ఆయా రాజకీయ నేతల భవితవ్యం తేలబోతోంది.