- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఓటర్ల జాబితా స్వచ్చీకరణ కు జిల్లాలోని అన్ని రాజకీయపక్షాల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టరేట్ లో గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం వివిధ రాజకీయపక్షాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అన్నారు.  జిల్లాలో మొత్తం 16 లక్షల 38 వేల 246 మంది ఓటర్లు ఉన్నారని ... వీరిలో పురుష ఓటర్లు 7 లక్షల 99 వేల 511 మంది ఉండగా , మహిళా ఓటర్లు 8 లక్షల 38 వేల 610 మంది .. ట్రాన్సజెండెర్లు 127 మంది ఉన్నారన్నారు.  జాబితాలో సవరణకు సంబంధించి ఫారం - 6 దరఖాస్తులు 1429 అందగా , 1055 పరిష్కరించడం జరిగిందని, నిబంధనల మేరకు లేని 288 దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందన్నారు.


ఫారం-7 దరఖాస్తులు 1724 అందగా , అందులో 986 పరిష్కరించడం జరిగిందని, నిబంధనల మేరకు లేని 640 దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందన్నారు. ఫారం-8 దరఖాస్తులు 7852 అందగా , 7374 పరిష్కరించడం జరిగిందని, నిబంధనల మేరకు లేని 291 దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందన్నారు. ఈ స‌మావేశంలో ప‌లువురు అధికారుల తో పాటు కొంద‌రు రాజ‌కీయ ప‌క్షాల ప్ర‌తినిధులు సైతం పాల్గొన్నారు. ఇక జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఇందులో చింత‌ల‌పూడి ఎస్సీ .. పోల‌వ‌రం ఎస్టీ నియోజ‌క‌వర్గాల తో పాటు దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు, నూజివీడు, కైక‌లూరు సీట్లు ఉన్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: