
ఎన్నికలకు ముందు టిడిపి నేత gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డితో తాను టచ్ లో ఉన్నట్లుగా ఈ సెల్ఫీ వీడియోలో తెలియజేశారు. తనని పేట చంద్రశేఖర్, సుజిత్ రెడ్డి, సాయి ప్రసాద్ అనే ముగ్గురు వ్యక్తులు పరిచయం చేశారని. వినూతకు సంబంధించి విషయాలను చెబితే 2024 ఎన్నికలకు ముందు రెండు లక్షల రూపాయలు ఇచ్చారని తెలిపారు రాయుడు. వినూత అసభ్యకరమైన దృశ్యాలను పంపితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి తనకు రూ .30 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి అడ్వాన్స్ కింద రూ.2 లక్షలు ఇచ్చారని ఈ వీడియోలో తెలియజేశారు. అంతేకాకుండా వినుత, చంద్రబాబును చంపాలని సుధీర్ రెడ్డి చెప్పిన రెండుసార్లు యాక్సిడెంట్ ప్రయత్నించిన కుదరలేదని మేడం వినూత నువ్వు కావాలని ఇలాంటివి చేస్తున్నావని డ్రైవర్ గా పనిలో నుంచి తీసేసారని తెలిపారు రాయుడు.
వినుత ప్రైవేట్ వీడియోలు కావాలని gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి తనని ఎన్నోసార్లు బెదిరించే వారంటూ తెలిపారు. కానీ బెడ్రూంలో కెమెరాలు, మొబైల్ రికార్డింగ్ వంటి వాటిలో వీడియోలు తీస్తున్న సమయంలో తాను దొరికిపోయానంటూ తెలియజేశారు రాయుడు. అయితే ఈ విషయంపై వినుత మేడంకి చెప్పిన ఆమె నమ్మలేదని తెలిపారు. ఈ వరుస పరిణామాలు అన్నిటిని నేపద్యంలో జులై 7వ తేదీన డ్రైవర్ రాయుడును కోట వినూత ,ఆమె భర్త చంద్రబాబు హత్య చేశారు. హత్యకు ముందు ఈ సెల్ఫీ వీడియో తీసుకున్నట్లుగా వైరల్ గా మారింది.డ్రైవర్ రాయుడు మరణించడానికి ఒక నెల ముందే డ్రైవర్ని సస్పెండ్ చేసినట్లుగా వినుత సోషల్ మీడియాలో తెలియజేసింది. ఎన్నో ఏళ్ల నుంచి రాయుడు, వినుత దగ్గర నమ్మిన బంటుగా, డ్రైవర్గా ఆమె వ్యక్తిగత సహాయకుడిగా కూడా ఉండేవారు. అయితే జూన్ 21వ తేదీన అతను చేసిన అసభ్యకరమైన ,అనుచితమైన కుట్రపూరితమైన ప్రలోభాలకు లొంగి మాకు ఎన్నో రకాల ప్రధాన గౌరవ అంశాలలో భంగం కలిగించారని అందుకే అతడిని తొలగిస్తున్నామంటూ ఆమె ప్రకటించింది ఇకమీదట డ్రైవర్ రాయుడు కి తమకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా గతంలో ప్రకటించింది.