అయితే బాబు స్పీచ్లో మరో ఆసక్తికర కోణం - రాజకీయ ముసుగులో నేరాలు. “ఇప్పుడు నేరాలు రాజకీయ పీచులో దాగి ఉంటున్నాయి. వీటి వెనుక ఉన్న అసలు ముఖాలను బయటపెట్టాలి. లేదంటే లా అండ్ ఆర్డర్ తారుమారవుతుంది” అని బాబు హెచ్చరించారు. రాజకీయ అండతో జరిగే నేరాలను పోలీసులు భయపడకుండా ఛేదించాలని ఆయన సూచించారు. ఇక ట్రెడిషనల్ డ్యూటీ మైండ్సెట్ నుంచి బయటపడాలని స్పష్టం చేశారు. “ఇప్పటి పోలీసింగ్ ఓల్డ్ వెర్షన్లో నడిస్తే సరి కాదు. స్మార్ట్గా ఆలోచించాలి, వేగంగా స్పందించాలి” అని బాబు అన్నారు. విజిబుల్ పోలీసింగ్ మాత్రమే కాదు, “ఇన్విజిబుల్ పోలీసింగ్” కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. “పోలీసు ప్రత్యక్షంగా కనిపించకపోయినా ప్రజల్లో భరోసా ఉండాలి, నేరస్తుల్లో భయం ఉండాలి - ఇదే అసలు స్మార్ట్ పోలీసింగ్” అని బాబు దిశానిర్దేశం చేశారు.
సీసీ కెమెరాలు, సైబర్ ఫోకస్, మాఫియాలపై వేట - ఇవన్నీ ఏపీ పోలీసింగ్కి కొత్త రూపాన్ని ఇస్తాయని చెప్పారు. ప్రతి 55 కిలోమీటర్లకు సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం మాఫియాలను బలంగా అణచివేస్తున్నామని వివరించారు. “ఓల్డ్ థాట్స్ పక్కన పెట్టి, న్యూ వెర్షన్ పోలీస్గా మారండి” అని బాబు స్పష్టం చేశారు. అభివృద్ధి, పెట్టుబడులు అన్నీ లా అండ్ ఆర్డర్పైనే ఆధారపడతాయని చెప్పారు. “శాంతి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే కారణం — మన పోలీస్ సామర్థ్యం” అని బాబు గర్వంగా చెప్పారు. మొత్తానికి... బాబు స్పీచ్ మాస్ టోన్లో, టెక్ టచ్తో, ఫ్యూచర్ మైండ్సెట్తో నిండిపోయింది. ఏపీ పోలీసింగ్కి ఇది కొత్త దిశ చూపే రోజు అని చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి