బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియాలో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఇక వరుసగా మ్యాచులు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ ఇప్పటికే ముగిసింది. ఇక ఈ మ్యాచ్లో తేలిపోయిన ఆస్ట్రేలియా జట్టు భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఏకంగా 132 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. అయితే ఇక ఫిబ్రవరి 17వ తేదీన అటు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రెండవ టెస్టు మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ లో గెలిచిన టీమిండియా రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా గెలిచి మరింత ఆదిత్యాన్ని సంపాదించాలని భావిస్తుంది. అదే సమయంలో ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓటమితో వెనుకబడిన ఆస్ట్రేలియా రెండవ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని భావిస్తుంది. ఇలాంటి సమయంలోనే ఇక రెండవ టెస్టు మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కూడా సిద్ధమైపోతున్నారు. ఇలాంటి సమయంలో టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారిపోయింది.


 చాలా రోజుల తర్వాత సొంత ప్రాంతానికి చేరుకున్నాను. ఇక ఢిల్లీకి ఇలా కార్లో లాంగ్ డ్రైవ్ లో వెళ్లడం ఎంతో కొత్త అనుభూతిని ఇచ్చింది అంటూ ఒక ఫోటోని విరాట్ కోహ్లీ షేర్ చేశాడు అని చెప్పాలి. కాగా విరాట్ కోహ్లీ ఢిల్లీకి చెందిన ఆటగాడు కావడం గమనార్హం. 1988లో జన్మించిన కోహ్లీ చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే ప్రాణంగా బ్రతికాడు. ఇక దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి 2008లో అండర్ 19 ప్రపంచకప్ టోర్ని లో భారత కెప్టెన్గా వ్యవహరించాడు. తర్వాత స్వల్ప కాలంలోనే టీమిండియాలోకి వచ్చి స్టార్గా ఎదిగాడు.  మహేంద్రసింగ్ ధోని ప్రోత్సాహంతో జడ్జిలో కీలక సభ్యుడుగా మారి ధోని వారసుడిగా ఇక ధోని తర్వాత కెప్టెన్సీ కూడా చేపట్టాడు.  ఇక ఇప్పుడు కెప్టెన్సీ రోహిత్ కు అప్పగించి జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: