ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నూతన కెప్టెన్ గా ఐడెన్ మార్కరమ్ ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని అటు జట్టు యాజమాన్యం ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. అయితే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా సన్రైజర్స్ ఫ్రాంచైజీ  కొనుగోలు చేసిన జట్టు ఈస్ట్రన్ కేప్ జట్టుకు అటు కెప్టెన్గా వ్యవహరించాడు ఐరన్ మార్కురమ్. ఈ క్రమంలోనే మొదటి సీజన్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు అన్న విషయం తెలిసిందే. అయితే సారథిగా అద్భుతంగా రాణించడమే కాదు ఇక ఒక ఆటగాడిగాను తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.



 ఈ క్రమంలోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్న ఐడేన్ మార్కరమ్ కు ఇటీవల ipl లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ అప్పగిస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే ఇక తనకు సన్రైజర్స్ కెప్టెన్సీ వహించే అవకాశం రావడం పై ఆనందం వ్యక్తం చేశాడు మార్కారమ్. ఇక మీడియా వేదికగా ఏకంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి మాట్లాడుతూ.. అతని ప్రతిభ పై ప్రశంసలు కురిపించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అద్భుతమైన జ్ఞాన సంపన్నుడు అంటూ కొనియాడాడు ఐడెం మార్కరమ్. అతడి సారధ్య శైలి ఎంతో ప్రత్యేకమైనది అంటూ ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి.


 అయితే దక్షిణాఫ్రికా ట20 లీగ్ కోసం ఇక భారత క్రికెట్ నుంచి ఎవరినైనా తీసుకోవాలని భావిస్తే మాత్రం తప్పకుండా తాను మహేంద్రసింగ్ ధోనీనే తీసుకోవడానికి మొగ్గు చూపుతాను అంటూ తెలిపాడు. ఎందుకంటే అతని అనుభవం యువ క్రికెటర్లు అందరికీ కూడా దిక్సూచిగా మారుతుంది అంటూ పేర్కొన్నాడు. ఇక అంతేకాకుండా మహేంద్రసింగ్ ధోని లాంటి దిగజా క్రికెటర్ తమ శిబిరంలో ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. అతని అనుభవం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ధోని నుంచి యువ క్రికెటర్లు ఎంతో ప్రయోజనం పొందుతారు. అంతర్జాతీయంగా చాలామంది ప్లేయర్లు ఉన్నప్పటికీ నా మనస్సులో ధోని మాత్రమే ఉన్నాడు అంటూ ఐడెం మార్కరమ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl