2023 ఐపీఎల్ సీజన్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇక ఈ టోర్నీలో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకటి క్వాలిఫైయర్ 2, మరొకటి ఫైనల్ మ్యాచ్. ఇప్పటికే ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన నాలుగు జట్లలో లక్నో జట్టు ఇక టోర్నీ నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్వాలిఫైయర్ 2 ఫైనల్ కోసం అటు అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ఏడాది ఐపీఎల్ సీజన్లో ఎన్నో అనూహ్యమైన ఘటనలు జరిగాయి. ముఖ్యంగా ఎంతో మంది ప్లేయర్లను గాయాల బెడద తీవ్రంగా వేధించింది అని చెప్పాలి.



 కొన్ని జట్లకు అయితే గాయాల బెడద కారణంగా కెప్టెన్లు కూడా దూరమైన పరిస్థితి ఏర్పడింది. ఇక అటు లక్నో జట్టుకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయింది. లక్నో జట్టు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ గాయం బారిన పడ్డాడు. దీంతో ఇక కేఎల్ రాహుల్కు డిప్యూటీగా ఉన్న కృనాల్ పాండ్య  జట్టు సారధ్య బాధ్యతలను భుజాన వేసుకున్నాడు అని చెప్పాలి. అయితే అతను కెప్టెన్సీ చేపట్టిన తర్వాత కూడా లక్నో వరుసగా విజయాలు సాధించింది. లక్నో అయితే విజయం సాధించింది. కానీ కృనాల్ పాండ్య ప్రదర్శన మాత్రం పూర్తిగా నిరాశాజనకంగానే ఉంది అని చెప్పాలి.



 ఇకపోతే ఇటీవలే ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు ఓడిపోయి చివరికి ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్య చెత్త రికార్డు నమోదు చేశాడు. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆడిన 9 ఇన్నింగ్స్ లో 92.15 స్ట్రైక్ రేటుతో కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. ఒకసారి మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్  చేయగలిగాడు అని చెప్పాలి. దీంతో అతని బ్యాటింగ్ పై విమర్శలు వస్తున్నాయి. ఇలా కెప్టెన్ అయ్యుండి అతి తక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు కృణాల్ పాండ్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl