
అయితే ధోనిలో ఉన్న ఈ సింప్లిసిటీనే అటు అభిమానులు అందరినీ కూడా ఫిదా చేసేసింది. ఇక ఆ తర్వాత కాలంలో వచ్చిన కెప్టెన్స్ కూడా ధోని చేసిన విధంగానే చేయడం మొదలుపెట్టారు అని చెప్పాలి. అయితే ఇటీవల 2023 ఐపీఎల్ సీజన్లో చెన్నై టైటిల్ గెలిచిన సమయంలో కెప్టెన్గా ధోని టైటిల్ అందుకోవాల్సి ఉంది. అలాంటి సమయంలో ధోని మాత్రమే కాకుండా టైటిల్ అందుకోవడానికి స్టేజ్ మీదకి జట్టులో ఉన్న మరో ఇద్దరు సీనియర్ క్రికెటర్లను కూడా పిలిచాడు. ఆ సీనియర్ క్రికెటర్లు ఎవరో కాదు.. చివర్లో రెండు బంతులకు సిక్సర్, ఫోర్ కొట్టి చెన్నై ను గెలిపించిన రవీంద్ర జడేజా.. కీలక ఇన్నింగ్ ఆడి చెన్నై ను గెలిపించి ఇక తన వీడ్కోలు మ్యాచ్ ఆడిన అంబటి రాయుడు.
ఇద్దరినీ స్టేజ్ మీదకి పిలిచి ఇక తనతో పాటు ట్రోఫీ అందుకునేలా చేసాడు ధోని. ఇక ఇదే విషయంపై అంబటి రాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని చర్య పట్ల ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందని మ్యాచ్.. అనంతరం ధోని తన గురించి మాట్లాడటం కూడా ఆనందంగా ఉందని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. ముగింపునకు కాస్త ముందు నన్ను జడేజాను ధోని పిలిచాడు. ట్రోఫీ అందుకోవడానికి తనతో పాటు మమ్మల్ని రమ్మన్నాడు. మా ఇద్దరితో అలా చేయించడం ఇదే సరైన సమయం అని ధోని భావించాడు. అయితే మాకు ఇది ప్రత్యేకమైనది. మళ్లీ ఇలా జరుగుతుందని అనుకోవట్లేదు. ధోని సంగతి ప్రపంచమంతా తెలుసు అంటూ అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు.