ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శనా చేసింది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఫైనల్ వరకు వచ్చింది. కానీ ఒక్క అడుగు దూరంలో ఓడిపోయి చివరికి రన్నరప్ తోనే సరిపెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టులో బిల్డప్ బాబాయ్ గా పేరుతెచ్చుకుంది ఎవరు అంటే అందరూ రియాన్ పరాగ్ పేరు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ప్రదర్శన తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ అన్నట్లుగానే అతని ప్రదర్శన సాగింది.


 అంతేకాదు ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన కొనసాగించిన రాజస్థాన్ రాయల్స్ తరఫున వ్యర్థమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది  రియాన్ పరాగ్ మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక్క మ్యాచ్లో కూడా జట్టుకు అతని ప్రదర్శన ఉపయోగపడలేదు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఫైనల్ మ్యాచ్లో కూడా ఏకంగా బౌలర్ అశ్విన్ బ్యాటింగ్ కు వచ్చిన తర్వాత రియాన్ పరాగ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు అంటే జట్టులో అతని స్థితి ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.


 రాజస్థాన్ రాయల్స్ జట్టులో అసలు రియాన్ పరాగ్ ఏం రోల్ పోషించాడు అన్నది క్లారిటీ లేదు అంటూ చెబుతున్నారు. అయితే గత సీజన్లో కొన్ని మంచి ఇన్నింగ్స్ లతో పేరుపొందాడు రియాన్ పరాగ్. ఈ ఏడాది సీజన్ లోను బాగా రాణిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులు అయిపోయాయ్. 15 మ్యాచ్ లలో  ఒకే ఒక అర్ధ శతకం తో 183 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఫైనల్లో  జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా రియాన్ పరాగ్ ప్రదర్శన చేయకపోతే ఇక  జట్టు లో ఉండి ఏం లాభం అంటూ అందరూ విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl