ప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్నారు మహమ్మద్ షమి. తన స్పిన్ బౌలింగ్ తో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆట తీరుతో ఇక టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఎంతో మంది యువ ఆటగాళ్ళు జట్టులోకి వచ్చి పోతున్నప్పటికీ షమీ మాత్రం తనను తాను ఎప్పటికీ కొత్తగా నిరూపించుకుంటూనే ఉన్నాడని చెప్పాలీ. అయితే మహమ్మద్ షమీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ఇప్పటికీ టీమ్ ఇండియాలో తన సత్తా ఏంటో నిరూపించుకొని నిలబడ్డాడు.


  ఎందుకంటే మహమ్మద్ షమీ స్టార్ బౌలర్గా కొనసాగుతున్న సమయంలోనే ఏకంగా అతని మాజీ భార్య అతని నుంచి విడాకులు తీసుకుంది. ఇక విడాకులు తీసుకుంటున్న సమయంలో మహమ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసింది అని చెప్పాలి. ఏకంగా మహమ్మద్ షమీ ఒకానొక సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇక ఈ ఆరోపణలు అతని కెరియర్ పై ఎంతగానో ప్రభావం చూపించాయి అని చెప్పాలి. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడిన మహమ్మద్ షమి చివరికి టీమ్ ఇండియాలోకి మళ్ళీ రి ఎంట్రీ ఇచ్చాడు.


 అయితే గతంలో మహమ్మద్ షమీపై అతని  మాజీ భార్య ఇక మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు అంటూ చేసిన ఆరోపణలపై అతని సహా బౌలర్ అయిన ఇషాంత్ శర్మ స్పందించాడు. శమీ గురించి నాకు తెలుసు. అతను 200% ఫిక్సింగ్ చేయలేదని నేను నమ్ముతున్నాను. షమీ ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం నన్ను సంప్రదిస్తే నేను ఇదే విషయాలను చెప్పాను అంటూ ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే షమీ మాజీ భార్య ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ అతను మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడలేదు అని తేలడంతో క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: