దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద డ్యాన్స్ రియాలిటీ షో `ఢీ` గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే 11 సీజన్స్ ముగించుకొని ఇప్పుడు `ఢీ`ఛాంపియన్స్ అంటూ 12వ సీజ‌న్‌లో అడుగుపెట్టి దుమ్ము దులిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ప్ర‌తి వారం ఈ షో టన్నుల టన్నుల కొద్ది ఎంటర్ టైన్మెంట్‌తో ముందుకు వ‌స్తోంది. ఇక ఈ షో ద్వారానే శేఖర్, , జానీ, రఘు, గణేశ్ ఇలా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పరిచయం అయ్యారు. ప్ర‌స్తుతం ఈ డ్యాన్స్ రియాలిటీ షోకు ప్రదీప్ మాచిరాజు యాంక‌రింగ్ చేస్తుండ‌గా.. సుడిగాలి సుధీర్‌,  రష్మీ గౌతమ్ మ‌రియు హైప‌ర్ ఆది, వ‌ర్ష‌ణీ టీం లీడర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

ఇక ఈ షోలో కంటెస్టెంట్స్  పెర్ఫామెన్స్ లు ఒక ఎత్తు అయితే..  ప్రదీప్, సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ, హైప‌ర్ ఆది మ‌రియు వ‌ర్ష‌ణీల కామెడీ ఒక ఎత్త‌ని చెప్ప‌లి. ప్రతి బుధవారం ఈటీవీలో వచ్చే ఈ షో డాన్సుల కోసం కేవ‌లం తెలుగు వారే కాకుండా.. ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తారంటే ఢీకి ఎంతో క్రేజ్ ఉందో అర్థ‌మ‌వుతోంది. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. వ‌చ్చే వారంలో ప్ర‌సారం కాబోయే ఈ షో ఎపిసోడ్ ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ ప్రోమో విడుద‌ల అయింది. దానిని బ‌ట్టీ చూస్తుంటే.. హైపర్ ఆది మరియు వర్షిణిల టీమ్ సుధీర్,రష్మిలా టీమ్ దగ్గర మూడు రౌండ్స్ ఓడిపోతాయి. 

 

ఢీ రూల్స్ ప్ర‌కారం మూడు రౌండ్స్ ఓడిపోతే ఒక కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌దీప్ ఒక‌రిని ఎలిమినేట్ చేయ‌మ‌ని అడ‌గ‌గా.. హైప‌ర్ ఆది షాకింగ్ స‌మాధానం ఇస్తాడు. తాను చెయ్యబోయే ఎలిమినేషన్ తన దగ్గర ఉన్న కంటెస్టెంట్స్ పెర్ఫామెన్స్ ను ఆధారం చేసుకొని చెయ్యడం లేదని ఆది అనడంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ అవుతారు. అయితే పెర్ఫామెన్స్ ను ఆధారంగా కాకుండా ఏ కారణం చేత ఎలిమినేట్ చేస్తున్నారు.. ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు అన్నది ప్రోమో చూసిన వారిలో ప్రశ్నార్ధకంగా మారింది. మ‌రి అది తెలియాలంటే మ‌ళ్లీ వ‌చ్చే బుధ‌వారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.


 

మరింత సమాచారం తెలుసుకోండి: