ఆ ఒక్క రోజు మాత్రం జూమ్ వినియోగదారులు ఎంత సేపైనా ఉచితంగా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చని ప్రకటించింది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ మరో కొత్త బాంబ్ పేల్చింది. తాము ప్రత్యేకంగా ఓ వీడియో కాలింగ్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. ఇందులో మరో విశేషం ఏంటంటే.. మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా వస్తున్న ఈ ఫీచర్లో మనం ఉచితంగా 24 గంటలూ వీడియో కాల్స్ మాట్లాడుతూనే ఉండొచ్చు. అలాగే ఒకేసారి 300మందితో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చట. తెరపై వరుసగా 49 మంది పార్టిసిపెంట్స్ను చూడొచ్చట.
మైక్రోసాఫ్ట్ టీమ్స్ తెస్తున్న ఈ ఫీచర్ కేవలం జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాలింగ్ సాఫ్ట్వేర్లతో పోటీ కోసమేనని నిపుణులు అంటున్నారు. దీనిపై మైక్రోసాఫ్ట్ టీమ్స్ నుంచి ఓ బ్లాగ్ పోస్ట్ కూడా వచ్చింది. ‘రాబోయే కాలంలో మీ అందరూ కనెక్ట్ అయ్యేలా ఉండటం కోసం సరికొత్త ఫీచర్ తీసుకొస్తున్నాం. దీంతో మీరు 24 గంటలూ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ఒక్కో కాన్ఫరెన్స్లో 300 మంది పాల్గొనవచ్చు’ అని ఈ బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. ఏదేమైనా మైక్రోసాఫ్ట్ టీమ్స్ తీసుకొస్తున్న ఈ ఫీచర్తో జూమ్ వంటి కంపెనీలకు చెక్ పడ్డట్లే అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ ఫీచర్ ఎంత బాగా క్లిక్ అవుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.