రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను  తీసుకొని వచ్చింది.PM KISAN యోజన పథకంలో ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రైతులకు, 20,000 కోట్ల రూపాయలను PM KISAN ఖాతాదారులకు డబ్బు పంపిన  ప్రతి ఒక్కరికి తెలిసిందే. పీఎం కిసాన్ లో చేరిన రైతుల జాబితాను https://pmkisan.gov.in/ ఈ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.

ఇకమీదట రైతుల కోసం mobile APP ద్వారా కూడా జాబితా చెక్ చేసుకునే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో NIC PM KISAN  APP ను తయారు చేయించింది. అంతేకాకుండా ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా  కల్పించింది. ఈ యాప్ ను ఇప్పటికే దాదాపుగా 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు. ఈ యాప్ ద్వారా PM KISAN లబ్ధిదారుల జాబితాను తెలుసుకోవచ్చు.

ఈ యాప్ ద్వారా పీఎం కిసాన్ సంబంధించిన  ఎటువంటి సమాచారం అయినా ఇందులో  దొరుకుతుంది. ఈ యాప్ లో రైతులు తమ ఖాతాలను రిజిస్ట్రేషన్ చేసుకోని యెడల , తమకు రిజిస్ట్రేషన్ కు  సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక తమకు రావలసిన పీఎం కిసాన్ డబ్బులు, వాటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఇక  మరొక అవకాశం ఏమిటంటే ఆధార్ కార్డులో ఉన్న పేరును  మార్చుకోవాలి అనుకుంటే ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుంది.

మనకు ఎటువంటి సమాచారం కావాలన్నా ఇందులో ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది. ప్రస్తుతం పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు త్వరలోనే జమ అవుతాయి. రైతులు ఆర్థికంగా వెనుకబడిన వారికి పీఎం కిసాన్ నుంచి ప్రతి ఒక్క రైతు కి సంవత్సరానికి 6,000 రూపాయలను 3 వాయిదా పద్ధతులలో జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం.ఇక  అటువంటి వారికి డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునే సదుపాయం కూడా ఈ అప్ లో కలదు.



మరింత సమాచారం తెలుసుకోండి: