మనిషి మెదడులో పుట్టిన చిన్నపాటి ఆలోచన ఎన్నో అద్భుతాలకు కారణం అవుతుంది అన్న విషయం తెలిసిందే. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడటానికి సరికొత్త మార్గాన్ని వెతుకుతూ ఉంటాడు మనిషి. ఇలా కొన్ని కొన్ని సార్లు సరికొత్తగా ఆలోచించడమే ఎంతో మందికి మేలు చేకూర్చే విధంగా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ సమస్యలలో నుంచి పుట్టిన ఒక వినూత్నమైన ఆలోచన గ్రామస్తులు అందరికీ వరం గా మారిపోయింది. ఒక రైతు మనసులో వచ్చిన చిన్నపాటి ఆలోచన ప్రస్తుతం గ్రామస్తుల కష్టాలను తీర్చింది. నదిని దాటేందుకు ఎన్నో రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడే గ్రామస్తులు ఇప్పుడు ఎంతో సులభంగా నది దాటి గలుగుతున్నారు.



 ఇక  వంతెన వేసుకున్న భారీ వర్షాలకు వంతెన కూడా మునిగిపోతుంది. ఈ నేపథ్యంలో రైతు చేసిన ఆలోచన గ్రామస్తులందరూ ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేసింది. కేరళలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మంచి నాక అనే ఒక చిన్న గ్రామంలో వరద అనే నదిని దాటేందుకు రైతు వినూత్న ఆలోచన చేశాడు.. అతని పేరు కృష్ణ బట్. అయితే నది అవతల వైపు ఇతనికి పొలం ఉంది. ఇక  తరచూ నది దాటడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వాడు. కొత్త ఆలోచన చేశాడు.  నది దాటే సమస్యకు పరిష్కారం కావాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే  రోప్ వే అయితే బెటర్ అని ఆలోచన చేశాడు.


 ఈ క్రమంలోనే సునీల్ అనే ఒక ప్రొఫెసర్ సాయంతో వరద నదికి అడ్డంగా ఒక పెద్ద బాస్కెట్ తో రోప్వే ను నిర్మించాడు. ఇక ఆ బాస్కెట్ లో కూర్చొని రోప్ వే సహాయంతో నదిని ఎంతో సులభంగా దాటవేయవచ్చు. ఇక దీని కోసం కృష్ణ బట్ 60 వేల రూపాయలు ఖర్చు పెట్టాడు.. ఇక అంతలోనే అతనికి గ్రామస్థుల నుంచి కూడా సహకారం అందింది. ఇక ఇప్పుడు మహేష్ భట్ కి వచ్చిన చిన్నపాటి ఆలోచన గ్రామస్తులందరి కష్టాన్ని తీర్చింది దీంతో అతని తెలివికి అందరూ హాట్సాఫ్ చెప్పేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: