రోజూవారి జీవన విధానంలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. శ్రమ తగ్గించేందుకు గాను ప్రజలు టెక్నాలజీని ఆవిష్కరించడం జరిగింది.ఈ టెక్నాలజీ పెరుగుతున్న ఈ సమయంలో కొత్త సమస్యలు కూడా పుట్టుకు వస్తున్నాయి. ఇక ఆయుర్వేద నిపుణులు చెబుతున్నదాని ప్రకారం మనం తీసుకునే ఆహారంను బట్టి మన జీవితం ఇంకా మన ఆరోగ్యం ఉంటుంది. కరెంట్‌ కుక్కర్ లో తయారు చేసిన ఆహారం అనేది విషంగా మారుతుంది అంటున్నారు.అల్యూమీనియం పాత్రలో తయారు అయ్యే ఆహారం విషం గా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కరెంట్‌ కుక్కర్‌ లో అల్యూమీనియం బౌల్‌ ను ఉపయోగిస్తారు. ఇక ఆ బౌల్‌ అనేది పూర్తిగా బయటకు కనిపించకుండా లో లోపలే అన్నంను రెడీ చేస్తుంది. అలా చేయడం వల్ల అల్లూమీనియంలోని ఆ విష పదార్థలు ఆహారంలో చేరతాయి.ఈ అల్యూమీనియంను అత్యధికంగా వేడి చేసిన సమయంలో విషపు వాయువులు కూడా వెలువడుతాయి.


ఇక ఒక సారి కనుక ఆ ఆహారం తింటే పర్వాలేదు పది ఇరువై సార్లు తిన్నా కూడా ఎక్కువ ప్రయోజనం ఉండక పోవచ్చు. కాని అదే పనిగా మాత్రం ఏళ్లకు ఏళ్లు తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా ఉన్న జీర్ణ వ్యవస్థను ఈ అల్యూమీనియంతో ఉండే ఆహార పదార్థలు ఈజీగా చెడగొడుతాయి. జీర్ణ వ్యవస్థ కూడా సమస్యలకు తలెత్తడంతో ముందు ముందు మరిన్ని అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి. గుండెకు సంబంధించిన సమస్య మొదలుకుని ఇంకా పలు అనారోగ్య సమస్యలకు ఖచ్చితంగా కరెంట్‌ కుక్కర్‌ లో వండిన అన్నం అవుతుందని అంటున్నారు. కీళ్ల సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. షుగర్‌ వ్యాది లేని వారు ఈ కుక్కర్‌ అన్నం తినడం వల్ల వెంటనే కాకున్నా భవిష్యత్తులో ఖచ్చితంగా షుగర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్యాస్‌ సంబంధిత సమస్యలు మొదలుకుని అధిక బరువు ఇంకా కాలేయం సంబంధిత సమస్యలు కూడా ఈజీగా తలెత్తుతాయి అంటూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: