ఇటీవల కాలంలో మనిషి జీవితం గ్యారెంటీ లేనిదిగా మారిపోయింది  అని చెప్పాలి.  ఎందుకంటే ఏ ప్రమాదం ఎటువైపు నుంచి దూసుకు వస్తుందో కూడా చెప్పలేని విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే కొన్ని కొన్ని సార్లు ఊహించని ఘటనలు ఏకంగా జీవితాన్ని మొత్తం తలకిందులు చేస్తూ ఉంటాయ్. ఏకంగా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని  నింపుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనం ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఇతరుల నిర్లక్ష్య వైఖరి ప్రాణాల మీదికి తీసుకువస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నేటి రోజుల్లో ఇలా రోడ్డు ప్రమాదాలలో వేరొకరు చేసిన తప్పిదం కారణంగా అభం శుభం తెలియని అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.


 అదే సమయంలో ఇక ప్రాణాలు కోల్పోవడం ఖాయం అనుకునే ప్రమాదాలలో కూడా వెంట్రుకవాసిలో ఎంతోమంది చిన్నచిన్న గాయాలతో బయటపడటం లాంటి ఘటనలు కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయని చెప్పాలి. ఇటీవల కాలంలో ఏకంగా బస్సు కదులుతున్న సమయంలో ఇక ముందు నుంచి రోడ్డు దాటేందుకు ప్రయత్నించి చివరికి బస్సు కింద పడిపోతూ గాయాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఒక వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించిగా బస్సు డ్రైవర్ అతన్ని గమనించలేదు. దీంతో బస్సు ముందుకు పోనిచ్చాడు.


 తప్పించుకునేందుకు అతనికి వేరే అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే చివరికి బస్సు కింద పడిపోయాడు. ఇక ఆ తర్వాత బస్సు అతనిపై ఎక్కినట్లు తెలుస్తుంది. అయితే అతను చనిపోయి ఉంటాడని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో ఇక బస్సు వెనకాల నుంచి అతను లేచి మళ్లీ డ్రైవర్ ను నిర్లక్ష్యంగా నడుపుతావా అంటూ నిలదీయడానికి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్లో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి అతను మృత్యుంజయుడు అంటూ ఎంతో మంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: