దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఈ ఔషధ ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దేశంలోనే అందరికీ సరిపడా ఔషధాలు అందించాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రం ఆలోచన ఎలా ఉన్నా బ్లాక్ మార్కెట్లో మాత్రం కోవిడ్ డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్రకు చెందిన పలువురు ఓఎల్ఎక్స్ యూజర్లు ఈ ఇంజెక్షన్లను వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు. ఒక్కో వాయెల్ను గరిష్ఠంగా రూ.6వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఓఎల్ఎక్స్లో ఎలాంటి మెడిసిన్ల విక్రయానికి అనుమతిలేదు. అలాంటిది కొవిడ్ చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమ్డెసివిర్ను ఈ వెబ్సైట్లో విక్రయిస్తుండటం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో రెమెడిస్విర్ ఇంజెక్షన్ల కొరత అధికంగా ఉంది. ఇక్కడ ప్రతి రోజూ వేల కేసులు నమోదవుతుండడంతో వారికి సరిపడా ఔషధాలను అందించడం అధికారులకు పెద్ద ఇబ్బంది మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనే బ్లాక్ మార్కెట్లో వీటి విక్రయాలు జోరుగా సాగుతుండటం గమనార్హం. అంతేగాక, డిమాండ్ పెరుగుతుండడంతో కొందరు నకిలీ ఇంజెక్షన్లను కూడా విక్రయిస్తున్నారు. మరి దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి