క్వాటర్ పడితే మందు బాబులకు మీటర్ పనిచేస్తుంది.. దాంతో ఎం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్థిస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే..అయితే కరోనా మహమ్మరి విజ్రుంభిస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు ప్రభుత్వం మూసేసింది.. దాంతో శానిటైజర్ మరణాలు ఎక్కువ కావడంతో మళ్ళీ దుకాణాల ను తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చింది. అది కూడా రాష్ట్రాలలో మాత్రమే.. తమిళనాడులో మాత్రం మందుబాబులకు చుక్కెదురయ్యింది..


అయితే ఇప్పుడు తమిళ తంబీలకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు.లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుల్లో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ఓ మందుబాబు మద్యం షాప్ దగ్గర వింతగా ప్రవర్తించాడు. మద్యం బాటిల్‌కు పూజలు చేశాడు. వైన్ షాప్ తెరవగానే.. మందు బాటిల్ కొనుగోలు చేసి ఈ పూజలు నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.జూన్ 14 నుంచి తమిళనాడులో 27 జిల్లాల్లోని టీ షాపులను తిరిగి తెరవడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


అంతేకాకుండా మరికొన్ని సడలింపులను కూడా ఆయన ప్రకటించారు. మరికొన్ని సడలింపులను కూడా ఆయన ప్రకటించారు. తమిళనాడు పశ్చిమ భాగంలో ఏడు, కావేరీ డెల్టా ప్రాంతంలో నాలుగు మినహా.. మిగతా 27 జిల్లాల్లో కొత్త సడలింపులు వర్తించనున్నాయి. వీటిలో చెన్నై దాని పరిసర జిల్లాలు కూడా ఉన్నాయి.కరోనా కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడులో మే 10న లాక్‌డౌన్ విధించారు. ఆ తర్వాత పలుమార్లు పొడింగించారు. అయితే 35 రోజుల విరామం తరువాత 27 జిల్లాల్లో జూన్ 14 నుంచి సెలూన్లు, పార్కులు, ప్రభుత్వ మద్యం షాపులు తిరిగి ప్రారంభించబడ్డాయి. ఈ సడలింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు సాయంత్రం 5 వరకూ అన్నీ దుకాణాలు తెరిచే ఉంటాయని అధికారులు వెల్లడించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: