అగ్రి కల్చర్ విద్యార్థులకు మన రాష్ట్రంలో మంచి భవిష్యత్తు ఉంది. ఇందులో ఒకప్పుడు మగవాళ్ళు ఎక్కువగా వుంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అగ్రికల్చర్ ను తీసుకుంటూన్నారు. అయితే వారికి పుస్తకాలల్లొ ఉన్నవి మాత్రమే కాదు. పొలంలో ఎలా పని చేయాలి. ఇలాంటివి చెస్తె ప్రతిదీ తెలుస్తుందని అంటున్నారు... ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రముఖ కాలెజిలొ ఇలాంటివి వెలుగులోకి వచ్చింది. వివరాల్లొకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా నైరా లో విద్యార్థులు అన్నదాతలుగా మారుతున్నారు. పట్టాలు పొందే నాటికి మట్టిపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకుంటున్నారు.
అందులో భాగంగానే ఈఎల్పీ అనే ప్రొగ్రాంను అనుసరిస్తున్నారు. అనుభవం కూడా ఉండటం వల్ల మంచి ఫలితం వుంటుందని యాజమాన్యాలు అంటున్నారు.. కాలెజికి ఇలాంటి ప్రాజెక్ట్ లు చేసి డబ్బుల ను కూడా అందుకోవడం విశేషం. అలా వచ్చిన డబ్బు ప్రాజెక్టు, గైడ్కు వెళ్తుంది. విత్తనోత్ప త్తి, కూరగాయల పెంపకం, పుట్ట గొడుగుల పెంపకం తో పాటు పూలు, పుచ్చకాయలు యూనిట్లు నెలకొల్పి వాటిని మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఈ కాలేజీలో పండించిన పంటల ను దగ్గరలో గల పరిశోధన కేంద్రాల కు, రైతులకు, క్షేత్ర స్థాయిలో వినియోగిస్తున్నారు.
ఇలాంటి అలొచనా రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎండిన ఆకులు, ఎండిన గడ్డి, కూరగాయల చెత్త, పశువుల గెత్తం తో దీన్ని తయారు చేస్తారు. కాలేజీ విద్యార్థులు తయారు చేసి కిలో రూ.12 చొప్పున అమ్ముతున్నారు. అలాగే పుట్ట గొడుగుల పెంపకం, అమ్మకాలు చెస్తున్నారు. అంతేకాదు పుచ్చకాయలు,వివిధ రకాల ఆకుకూరల ను విద్యార్థులు పండిస్తున్నారు. పంట చేతికి వచ్చినప్పుడు విద్యార్థులు స్వయంగా రోడ్డు మీదకు వచ్చి కూరగాయలు అమ్ముతుంటారు. కాజిలు పెట్టిన పెట్టుబడి పోగా మిగిలినది స్టూడెంట్స్ కు అందుథుంది. ఇలాంటి ఆలోచనలు విద్యార్థుల కు రావడం నిజంగా గ్రేట్ భయ్యా.. ఆ ఎరియాల్లొ విద్యార్థులు రియల్ హీరోలు అయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి