పశ్చిమ బెంగాల్ లో బిజెపి కౌన్సిలర్ హత్య సంచలనం రేపింది. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఉన్నతాధికారులను రాజ్ భవన్‌ కు పిలిపించారు. ఆదివారం రాత్రి ఒక ట్వీట్‌ లో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. "శాంతిభద్రతల పరిస్థితి మరింత దిగజారుతున్న సమయం, టైటాగర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ మనీష్ శుక్లా హత్యకు దారితీసింది" అని పేర్కొన్నారు.

బిజెపి ఉత్తర 24 పరగణాల జిల్లా కమిటీ సభ్యుడు మనీష్ శుక్లాను ఆదివారం సాయంత్రం బెంగాల్ టైటాగర్ లో కాల్చి చంపారు. పార్టీ కార్యాలయానికి వెళుతుండగా ఎపి దేవి రోడ్డులోని శుక్లా వద్ద కొంతమంది బైక్ మీద వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి. దీనితో సిఎం, డీజీపీ వెళ్ళే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: