అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బాలయ్య టాక్ షో ప్రీమియర్ ఆహా ఓటీటీలో ప్రసారమవుతోంది. ఇక మొదటి ఎపిసోడ్ లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ సందడి చేసిన సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ లుగా మంచు విష్ణు, మంచు లక్ష్మి, మోహన్ బాబు హాజరయ్యారు. కాగా బాలయ్య ఆసక్తికర ప్రశ్నలతో మోహన్ బాబు నుండి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ లను రాబడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో జోకులు కూడా పేలాయి. మోహన్ బాబు తను రోజూ జిమ్ చేస్తాను అంటూ బాలయ్యకు చెప్పారు. 

దాంతో బాలయ్య మోహన్ బాబు గాలి తీశారు. ఎందుకు సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టుకోవడానికా అంటూ పంచ్ ఇచ్చాడు. దాంతో మోహన్ బాబు అందుకు కాదు.... పెట్టే చోట పెడతా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఇలా ఒకటి రెండూ కాకుండా షో మొదటి నుండి బాలయ్య మోహన్ బాబు ల మధ్య జరుగుతున్న సంభాషణ ఆసక్తికరంగా కొనసాగుతుంది. అంతేకాకుండా షో లో బాలయ్య త‌న‌ స్టైల్ లో పంచ్ ల వర్షం కురిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: