తిరుమల అన్నమయ్య భవన్ లో ఈరోజు ఉదయం టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగనున్న పాలకమండలి సమావేశంలో 55 అంశాలపై చర్చించి ఓ కీల‌క నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమల, తిరుపతిలో పలు ఇంజనీరింగ్ పనులకు ఆమోదం పాలకమండలి తెలుపనున్న‌ది. టీటీడీ గోల్డ్ డిపాజిట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎస్బీఐకి మార్చే అంశంపై కూడా ఇవాళ చర్చించనున్నారు.

టీటీడీ మార్కెటింగ్ విభాగంలో కొనుగోళ్లకు సంబంధించి కూడా పాలకమండలి నిర్ణయం తీసుకోనున్న‌ది. తిరుమలలో రింగ్ రోడ్ లోని సందీప్ రెస్టారెంట్ ను ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థకు మూడేండ్ల‌ లీజ్ పొడిగింపుపై పాలకమండలి ఆమోదం తెలుపనున్న‌ది. ఇక శ్రీవారి కళ్యాణ కట్టలో క్షురకులుగా పని చేసే శ్రీవారి సేవకుల వేతనాల పెంపుపై బోర్డులో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ స‌మావేశంలో చర్చించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: