దేశంలో కరోనా వల్ల పేద ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల ప్యాకేజీ ప్రకటించారు. దీనితో పేద ప్రజల కష్టాలు తీర్చే మార్గం సుగమం అవుతుంది. ఇక ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ ప్రధాన సూత్రాలు. ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే ముందు ఈ సంస్కరణలను అర్తం చేసుకోవాలి. గత 40 రోజులుగా పీపీఈలు, వెంటి లేటర్లను స్వదేశంలోనే ఉత్పత్తి చేస్తున్నాం. లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ వంటి సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చాయి.
గడిచిన ఐదేళ్లుగా ఎన్నో సంస్కరణల్ని అమలు చేశాం. మొబైల్ బ్యాంకింగ్, జన్ ధన్ ఖాతాలతో దేశంలో విప్లవం వచ్చింది. పీఎం కిసాన్ యోజన వంటి పథకాల ద్వారా రైతులను ఆదుకున్నాం. నవ భారత నిర్మాణం మన లక్ష్యం అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.