గత కొన్ని నెలలుగా కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల సైలెంట్ గా ఉన్న టీడీపీ, వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న ఘటనలు మరలా వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలోని అరిలోవ 13వ వార్డులో శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరైన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు సమాచారం అందుతోంది. 
 
గాయాలైన టీడీపీ కార్యకర్తలను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైసీపీ దాడికి నిరసనగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: