తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో ఒక్కరోజే 730 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత 24 గంటల్లో నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,802 కు చేరింది. నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 659 కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రంలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. లాక్ డౌన్ నిబంధనలు సడలించటం వల్లే ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 210కు చేరడంతో ప్రజల్లో ఆందోళన మరింతగా పెరుగుతోంది. రాష్ట్రంలో 3,861 యాక్టివ్ కేసులు ఉండగా 3,731 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: