దేశ రాజధాని ఢిల్లీపై కరోనా పంజా విసురుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీలో గడచిన 24 గంటల్లో 3390 కొత్త కేసులు నమోదయ్యాయి. 64 మంది ఒక్కరోజులో మృతి చెందగా 3328 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీలో ఇప్పటివరకు 73,780 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 44,765 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
2429 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. ఢిల్లీ సర్కార్ నిబంధనలను ఎంత కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరికొన్ని రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: