మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రాణాలను పణంగా పెట్టి వవిధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
ఇప్పటికే మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న పోలీస్ అధికారుల సంఖ్య ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇక గత 24 గంటల్లో మహారాష్ట్రలో 77 మంది పోలీసు సిబ్బంది కరోనా వైరస్ భారిన పడ్డట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 1030 మంది అధికారులు కరోనా వైరస్ బారిన పడగా 59 మంది పోలీస్ అధికారులు మరణించారు.