సినీ సెలబ్రిటీల పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతు ఉంటుంది. సినీ రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు.
తాజాగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కపేలా సినిమా చూసి సినిమాలో అరవడాలు లేవు, మాస్ అప్పీల్ లేదు అనవసర సన్నివేశాలు లేవు అంటూ కామెంట్ చేసాడు. అయితే తరుణ్ భాస్కర్ వ్యాఖ్యలను తప్పు పడుతూ ఓ హీరో అభిమానులు తమ హీరో సినిమా గురించి ఇలా మాట్లాడాడు అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై తరుణ్ భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, తనను కొంతమంది తిట్టడం తోపాటు బెదిరింపులకు పాల్పడ్డారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.