జులై 30న థియేటర్లలో సందడి చేయడానికి "తిమ్మరుసు" సిద్ధమవుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తరువాత రిలీజ్ అవుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ట్రైలర్ లో మ్యాటర్ ఉండడంతో ప్రేక్షకులను నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచేశారు.


 యంగ్ హీరో సత్యదేవ్ లాయర్ గా కనిపించబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ పూర్తి చేశారు మేకర్స్. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు జరగనున్న "తిమ్మరుసు" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నానిని ఆహ్వానించారు. ఈ మేరకు పోస్టర్ ను రిలీజ్ చేసి విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. మరోవైపు ఇప్పటికే "తిమ్మరుసు" అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. "తిమ్మరుసు"లో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: