కేంద్ర ప్రకటించిన పద్మ అవార్డు విజేతలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రత్యేకించి తెలుగు వారు ఈసారి చాలా మంది పద్మ అవార్డులు గెలుచుకోవడం సంతోషం కలిగిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి.. శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవి ఏమని ట్వీట్ చేశారంటే..
“ పద్మ అవార్డు విజేతలందరికీ నా శుభాకాంక్షలు.. వీరిలో మన రాష్ట్రానికి చెందిన ప్రముఖులు గరికపాటి నరసింహారావు, షావుకారు జానకి, శ్రీమతి పద్మజారెడ్డి, శ్రీ మొగిలయ్య, శ్రీ షేక్‌ హాసన్, డాక్టర్ సుంకర ఆదినారాయణ, కృష్ణా ఎల్ల, సుచిత్రా ఎల్ల, నా మిత్రుడు గులాం నబీ ఆజాద్, సింగర్ సోను నిగమ్‌, భారతీయులకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చిన సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌ లు ఉండటం నాకెంతో సంతోషాన్నిస్తోంది. వారికి నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు.” ఇలా మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాదు.. అనేక మంది ప్రముఖులు పద్మ అవార్డు విజేతలకు శుభాకాంక్షలు చెబుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: