ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. యడ్లపాడు మండలం వంకాయలపాడులో ఐటిసి సంస్థ ఏర్పాటు చేసిన ప్రాసెసింగ్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 6.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.250కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గుంటూరులో జరిగే మైనార్టీ దినోత్సవం, వైద్య కళాశాల పైలాన్ ఆవిష్కరణలో సీఎం పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  


పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌కు  ఉదయం 9.40 – 10.35 వరకు సీఎం జగన్ చేరుకుంటారు. ఐటిసి ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.  11.10 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటుచేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తారు.  మధ్యాహ్నం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.50 గంటలకు గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ చేరుకుని ప్లాటినం జూబ్లీ పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా వైసీపీ నేతలతో భేటి అవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: