ప్రజలు ఎటువంటి భయాందోనళకు గురి కావద్దన్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు.. సీఎం కేసీఆర్ దిశానిర్ధేశంతో తెలంగాణ ఇప్పటికే కరోనాను విజయవంతంగా ఎదుర్కొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలచిందని గుర్తు చేశారు. కరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని పరిశీలించుకోవాలని.. మానవ వనరులు, మందులు, ఆక్సిజన్ , ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలన్న మంత్రి హరీశ్ రావు.. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు.
ప్రజలు ఎటువంటి భయాందోనళకు గురి కావద్దన్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు.. సీఎం కేసీఆర్ దిశానిర్ధేశంతో తెలంగాణ ఇప్పటికే కరోనాను విజయవంతంగా ఎదుర్కొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలచిందని గుర్తు చేశారు. కరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని పరిశీలించుకోవాలని.. మానవ వనరులు, మందులు, ఆక్సిజన్ , ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలన్న మంత్రి హరీశ్ రావు.. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు.