నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న, చిన్న కారణాలకే ప్రాణాలను ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కుటుంబ కలహాలతో ఒక్కరు, ప్రేమ వ్యవహారంతో మరొక్కరు, వివాహేతర సంబంధాల వలన మరికొంత మంది ఇలా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.

ఈ మధ్యకాలంలో బ్రతుకు భారమై ప్రాణాలను వదిలేస్తున్నారు. తాజాగా విశాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  ఆరేళ్ళ కొడుకుని చంపి.. తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ కన్నతల్లి. ఆర్ధిక ఇబ్బందులే కారణమని సూసైడ్ నోట్ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడిందని విశాఖ పోలీసులు తెలిపారు. ఈ ఘటన మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీ జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన సరిత కుటుంబం 2015లో విశాఖపట్నం వచ్చి స్థిరపడింది. ఆమె మారిక వలస రాజీవ్ గృహ కల్ప కాలనీలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తుంది. ఇక సరిత జీవనోపాధి కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తకు హోటల్ బిజినెస్‌ లో లాస్ రావడంతో మరో హోటల్‌ లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే, వ్యాపారానికి సంబంధించి నష్టాలు రావడం, ఇందుకు కోసం చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో భార్య, భర్తల మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్ధలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన సరిత ఆత్మహత్యకు పాల్పడింది. అంతేకాదు.. తన ఆరేళ్ల కొడుకును చంపి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సంఘటన పోలీసులు సంఘటా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే సరిత రాసిన సూసైడ్ నోట్ ‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: