ఒకప్పుడు మహిళలు తీవ్ర స్థాయిలో వివక్షకు గురి అయ్యేవారు. కానీ నేటి రోజులలో పురుషులకు తాము ఎక్కడ తక్కువ కాదు అని ఎంతో మంది మహిళా మణులు నిరూపిస్తున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ మహిళల సాధికారత వైపు అడుగులు వేస్తున్నారు. ఇక పురుషులతో సమానంగానే చదువుల్లో కూడా రాణిస్తున్నారు. ఇలా నేటి రోజుల్లో మహిళల సాధికారత సాధించచాము అని ప్రతి మహిళ అనుకుంటున్న సమయంలో నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న అత్యాచార ఘటనలు మాత్రం మహిళల జీవితాన్ని మొత్తం ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి.


 కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. ఉరిశిక్ష విధించిన అటు కామాంధుల తీరులో మాత్రం ఎక్కడ మార్పు రావడం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా  ఆడ వాసన తగిలింది అంటే చాలు కామంతో ఊగిపోతూ దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న మానవ మృగాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. దీంతో కామపు కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ఆడపిల్ల ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా లైంగిక వేధింపులకు గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అనుక్షణం ఆడపిల్ల భయపడుతూ బతకాల్సిన దుస్థితి ఏర్పడింది నేటి సమాజంలో.



 ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది. డోర్నకల్ మండలం లోని రాము తండా పంచాయతీ లో ఓ వివాహిత పై అత్యాచారం జరిగింది. ఇదే ప్రాంతానికి చెందిన బానోతు ప్రశాంత్ ఇటీవలే రాత్రి సమయం లో వివాహితపై అత్యాచారం కి పాల్పడ్డాడు. అదే ప్రాంతం లో ఉంటున్న వివాహిత రాత్రి సమయం లో స్నానం చేసి బాత్రూం లోకి వెళ్ళిన సమయంలో ప్రశాంత్ బాత్ రూం లోకి ప్రవేశించి ఆమె పై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: