ఇటీవల ఇలాంటి తరహా ఘటనలు తరచూ సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇటీవల వైఎస్ఆర్ జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు చేసేదేమీలేక పోలీసులను ఆశ్రయించగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఎవరి ఇళ్లకు వారిని పంపించేశారు. కమలాపురం నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు పెండ్లిమర్రి మండలం మిట్టమీద పల్లి కి చెందిన ఓ వ్యక్తితో గత ఏడాది కిందట వివాహం జరిగింది.
అయితే గత కొన్ని రోజుల నుంచి వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు మహిళకు తన బంధువైన వేంపల్లె రాజీవ్ కాలనీకి చెందిన మరో మహిళతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది. దీంతో సభ్యసమాజం ఏమనుకున్నా పర్వాలేదు అనుకుని భావించి వీరిద్దరూ రహస్యంగా శ్రీకాళహస్తిలో వివాహం చేసుకున్నారు. ఇటీవలే వేంపల్లె పోలీస్ స్టేషన్కు చేరుకుని తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరారు. ఇక పోలీసులు ఒక్కసారిగా వారిని చూసి అవాక్కయ్యారు. వెంటనే వారి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారి సమక్షం లోనే ఆ ఇద్దరు మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.