ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఒక అందమైన జీవిత భాగస్వామి అర్థం చేసుకునే అమ్మాయి మన జీవితం లోకి వస్తే చాలు అనుకునే వారు ఎంతోమంది. ఇటీవలి కాలంలో మాత్రం భార్య ఎలా ఉన్నా పర్వాలేదు కానీ వచ్చే కట్నకానుకలు మాత్రం బాగుండాలని భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక పెళ్లితో సరిపెట్టుకోకుండా రెండు మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్న  ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.  మనవళ్ళతో ఆడుకోవాల్సిన వయసులో కూడా ఎంతో మంది పెళ్లిళ్లకు సిద్ధమవుతూ ఉండటం చూస్తూ ఉంటే అందరూ అవాక్కవుతున్నారు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అప్పటికే అతనికి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి.  ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు.  ఇలాంటి సమయంలో మరో పెళ్ళికి సిద్ధమయ్యాడు ఆ ప్రబుద్ధుడు. విషయం తెలిసిన అతని రెండో భార్య ఏడుగురు పిల్లలు బంధువులతో కలిసి చివరికి ఐదో వివాహాన్ని అడ్డుకున్నారు. అంతేకాదు పెళ్లి కుమారుడిగా ముస్తాబైన సదరు వ్యక్తిని దాడి చేసి దారుణంగా కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఈ ఘటన తో  ఒక్కసారిగా భయపడిన వధువు  అక్కడి నుంచి పారిపోయింది.


 యూపీలోని మొహల్లా కు  చెందిన 55 ఏళ్ల వ్యక్తి రోడ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. గతంలో నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు సంతానం కలిగారు.  రెండో భార్యకు దూరంగా ఉంటూ ఆమెకు సైతం విడాకులు ఇచ్చాడు. ఎవరికి తెలియకుండా మూడో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇంకో పెళ్లి కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఐదో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కాగా ఈ విషయం రెండో భార్య పిల్లలకు తెలిసింది.  దీంతో ఏకంగా పెళ్లి మండపానికి చేరుకున్న వారు వరుడిపై  దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: