ఇక జనాల మూఢనమ్మకాలను క్యాష్ చేసుకుంటున్న ఎంతోమంది బురిడీ బాబాలు పూజల పేరుతో కావలసినంత గుంజుతూ చివరికి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మోసపోయామని గ్రహించిన ఎంతోమంది బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అంటే టెక్నాలజీకి మారుపేరుగా పిలుస్తూ ఉంటారు అందరూ.
కానీ అలాంటి హైదరాబాద్ నగరంలో పూజల పేరుతో ఒక వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఇటీవల అతని అరెస్టు చేసారూ హైదరాబాద్ పోలీసులు. పంజాబ్ లోని మొహాలీకి చెందిన లలిత్ జ్యోతిష్యం పేరుతో సమస్యలు తీరుస్తాను అంటూ నగరానికి వచ్చాడు. ఈ క్రమంలోనే ఒక మహిళతో పరిచయం ఏర్పరచుకున్నాడు. పూజల పేరుతో పలు విడతలుగా 47 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయితే లలిత్ చెప్పినట్లుగా జరగకపోవడంతో బాధితురాలు ప్రశ్నించింది. దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు సదరు పూజారి. ఇక మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించిగా రంగంలోకి దిగిన పోలీసులు అతని అరెస్టు చేశారు.