ఇటీవల కాలంలో జరుగుతున్న ఘటనలు చూసిన తర్వాత ఎవరిని నమ్మలో ఎవరిని నమ్మకూడదు కూడా తెలియని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొంతమంది కొన్ని కొన్ని సార్లు దుర్బుద్ధితో ఆలోచిస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. సాటి మనుషులపై ఉన్న నమ్మకం పోయేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. ఇటీవల కాలంలో చాలామంది  గ్రామాల్లోకి వెళ్లి వీధి వీధి తిరుగుతూ ఇక పాడైన బ్యాగులకు జిప్పులు వేస్తాం అంటూ తిరుగుతూ ఇక వచ్చిన దాంతో  జీవనోపాధి పొందుతున్నారు.



 మహిళ కూడా ఎప్పటిలాగానే గ్రామానికి వచ్చి వీధి వీధి తిరుగుతూ ఇక పాడైపోయిన పాత బ్యాగులకు కొత్త జిప్పులు వేస్తాం అంటూ తిడుతూ ఉంది. ఇంతలో ఒక మహిళ ఆమెను తన ఇంటి వద్దకు పిలిచింది.  ఈ క్రమంలోనే పాడైపోయిన బ్యాగులకు కొత్త జిప్పులు వేసింది సదర మహిళ. అయితే తర్వాత డబ్బులు తెస్తానంటూ సదరు ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత జిప్పులు వేయడానికి  వచ్చిన మహిళా ఊహించని పని చేసింది. దీంతో ఇక బయటికి వచ్చిన ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్ అయింది అని చెప్పాలి.


 ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఓ గ్రామంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. పాత బ్యాగులు జిప్పులు వేస్తామంటూ ఒక మహిళా గంగాదేవి వీధిలో అరుస్తూ తిరుగుతూ ఉంది. ఓ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన మహిళ పాత బ్యాగ్ రిపేర్ చేయాలంటూ చెప్పింది. ఇక ఆ తర్వాత డబ్బులు తీసుకువచ్చేందుకు లోపలికి వెళ్ళింది. అయితే సదరు మహిళ డబ్బులు తీసుకొని బయటకి వచ్చేసరికి బ్యాగులు రిపేర్ చేసే మహిళ  మొబైల్ ఫోన్ కూడా కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించిన ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: