మనిషికి ఎప్పుడు ఎలా మరణం సంభవిస్తుంది అన్నది ఊహకందని విధంగానే ఉండేది. అయితే ఈ మాట మనిషి పుట్టుక జరిగిన నాటి నుంచి వినిపిస్తూ ఉంది. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇది నిజమే అని అందరిలో భావన కలుగుతుంది. కారణం అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న మనిషి చూస్తూ చూస్తుండగానే కేవలం క్షణాల వ్యవధిలో కుప్ప కూలిపోయి ప్రాణాలు వదులుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తేనే ఇలా ఆకస్మిక మరణం సంభవించేది అని అందరూ నమ్మేవారు. కానీ ఇప్పుడు పౌష్టికాహారం తీసుకునే డాక్టర్లు ప్రతిరోజూ వ్యాయామం చేసే ఫిట్నెస్ ట్రైనర్లు..  చెడు అలవాటులకు దూరంగా ఉండే చిన్నారులు..  ఇలా చెప్పుకుంటూ పోతే అందరినీ సడన్ హార్ట్ ఎటాక్ లు కబలిస్తున్నాయి.



 అసలు సడన్ హార్ట్ ఎటాక్ లు ఎందుకు వస్తున్నాయి.. ఎందుకు ఇలా ప్రాణాలు తీసేస్తున్నాయి అన్న ప్రశ్నకు ఇప్పటికీ ఎవరికీ సమాధానం తెలియడం లేదు. కానీ ఇలా సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే సడన్ హార్ట్ ఎటాక్ లు ఇప్పటికీ ప్రాణాలు తీస్తూ ఉంటే.. మరోవైపు ప్రకృతి విపత్తులు కూడా పగ పట్టినట్లుగానే వ్యవహరిస్తూ ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘాటనే జరిగింది.



 క్రికెట్ ఆడుతూ 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అయితే క్రికెట్ ఆడుతూ మరణించాడు అనగానే అతనికి సడన్ హార్ట్ ఎటాక్ వచ్చింది అనుకోకండి.. సడెన్ హార్ట్ ఎటాక్ కాదు ఏకంగా ప్రకృతి విపత్తు అతని ప్రాణం తీసింది. విజయనగరం లోని గాజుల రేఖలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న వారిపై పిడుగు పడటంతో 22 ఏళ్ళ ఇజ్రాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అఖిల్, సురేష్ అనే మరో ఇద్దరు గాయపడ్డారు. ఇక వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: