ఏంటో మనుషుల్లో రోజురోజుకు మానవత్వం అనేది కనుమరుగైపోతుంది. ఒకప్పుడు మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనిషి ఇక ఇప్పుడు కలికాలం ప్రభావమో లేక పోతే మారుతున్న కాలం ప్రభావమో తెలియదు కానీ ఏకంగా దారుణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. ఎవరిలో కూడా కనీస మానవత్వం అనేది కనిపించడం లేదు నేటి రోజుల్లో. ఏకంగా క్రూర మృగాలు సైతం  మానవత్వాన్ని చూపిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటే.. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు మాత్రం అడుగడుగున దారుణం గా వ్యవహరిస్తున్న ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయ్.


 ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో దారుణ ఘటన వెలుగులోకి వస్తున్నాయి. బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా కనీసం మానవతా విలువలు కూడా లేకుండా దారుణం గా వ్యవహరిస్తున్నారు మనుషులు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆస్తుల కోసం దారుణం గా వ్యవహరిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా ఆస్తుల కోసం రక్తం పంచుకుని పుట్టిన వారి ప్రాణాలు తీయడానికి కూడా ఎవరు వెనకాడటం లేదు.   తోడబుట్టిన వారికంటే ఆస్తులే ముఖ్యం అంటూ భావిస్తున్నారు నేటి రోజుల్లో జనాలు.


 ఇక్కడ ఇలాంటి ఒక అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తుల కోసం మానవత్వం గురించి మర్చిపోయారు ఆ కుటుంబం. దీంతో ఖాళీ బాండ్ పేపర్ పైన ఏకంగా చనిపోయిన ఒక కుటుంబ సభ్యురాలి నుంచి వేలిముద్రలు తీసుకోవడం మారిపోయింది. ఈ ఘటన కర్నాటకలోని మైసూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.. శ్రీరామపురం ప్రాంతానికి చెందిన జయమ్మ వృద్ధాప్యం కారణంగా మరణించింది.  వృద్ధురాలు పేరుమీద ఏకంగా 14 ఎకరాల భూమి ఉంది. అయితే ఆమెకు భర్త గాని సంతానం కానీ లేకపోవడంతో ఆస్తి ఎవరికి చెందాలి అనే అంశంపై బంధువులు అందరి మధ్య కూడా ఒక చర్చ జరిగింది. దీంతో జయమ్మ అక్క కుమారుడు ఆమె మృతదేహం నుంచి ఖాళీ బాండ్ పేపర్పై వేలిముద్రలు తీసుకోవడం గమనార్హం. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: