ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి. 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఎవరు ఊహించిన విధంగా ప్రాణాలు కోల్పోయింది. ఏకంగా చెరుకు మిషన్ కారణంగా సదరు యువతీ ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీకూర్పంలో చెరుకు రసం తాగడానికి చెరుకు రసం మెషిన్ దగ్గరికి వెళ్ళింది యువతి. అయితే ఊహించని రీతిలో ఆ యువతి చున్నీ మిషన్ చక్రాలలో ఇరుక్కుపోయింది. ఈ క్రమంలోనే ఇక ఆ చున్నీ మెడకు బిగుసుకుపోయింది అని చెప్పాలి. అయితే యువతి అప్రమత్తమయ్యే లోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది.
మెడకు చున్ని బిగిసుకునే లోపే ఇక చున్నీని తీసివేయాలని ఆ యువతి ప్రయత్నించింది. కానీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఇలా మెడకు చున్ని బిగుసుకోవడంతో యువతి చివరికి స్పృహ కోల్పోయింది. అయితే అక్కడే ఉన్న స్థానికులు వెంటనే మెడకు బిగుసుకున్న చున్నీ తీసి ఆసుపత్రికి తరలించారు. ఇలా వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. యువతీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు విగత జీవిగా కనిపించడంతో ఇక తల్లిదండ్రులు బోరున విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి