ఇటీవల సోషల్ మీడియాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా ఉన్న ఒక ఫోటో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ ఫోటో సినిమా సెట్స్ నుంచి లీక్ అయింది కాదు. అది ఒక ఆర్టిస్ట్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా క్రియేట్ చేసిన ఫోటో. ఈ విషయం తెలియని (లేదా తెలిసినా కావాలనే) కొందరు నెటిజన్లు.. "సీత పాత్రకు సాయి పల్లవి అస్సలు సెట్ అవ్వదు.. ఈ సినిమా తన వల్లే నాశనం అవుతుంది" అంటూ నెగెటివ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
సాయి పల్లవిని టార్గెట్ చేయడానికి కేవలం ఈ ఫోటో మాత్రమే కారణం కాదు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెస్తున్నారు. కొన్నేళ్ల క్రితం "పాకిస్థాన్ వాళ్లు కూడా మన లాంటి మనుషులే" అని ఆమె అన్న మాటలను, దేశ వ్యతిరేక వ్యాఖ్యలుగా చిత్రీకరిస్తూ ఇప్పుడు సీత పాత్రకు ఆమె అర్హురాలు కాదని కొందరు అజెండా ప్రకారం ప్రచారం చేస్తున్నారు.రామాయణం లాంటి మూవీలో సాయి పల్లవి ఎంపికైనప్పటి నుంచి ఈ నెగెటివిటీ కొనసాగుతూనే ఉంది. ఆమె నటనపై ఉన్న నమ్మకం కంటే, గతంలోని మాటలనే ఆయుధంగా చేసుకుని ట్రోల్ చేయడం గమనార్హం.
ఒకవైపు ట్రోలింగ్ జరుగుతున్నా.. సాయి పల్లవి అభిమానులు మాత్రం గట్టిగా సమాధానం ఇస్తున్నారు. "భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండియా మొత్తం ప్రేమించే నటి సాయి పల్లవి. ఆమె కళ్ళల్లో ఉండే పవిత్రత, నటనలో ఉండే సహజత్వం సీతమ్మ పాత్రకు పక్కాగా సరిపోతాయి" అని ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు.ఎన్ని వివాదాలు వచ్చినా సాయి పల్లవి మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.. సాయి పల్లవి కూడా తన నటనతోనే ఈ విమర్శకుల నోళ్లు మూయిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నెగెటివ్ ప్రచారం ఒక్కటే ఇండస్ట్రీలో ఇబ్బందికరంగా మారింది. మరి ఈ భారీ నెగెటివిటీని ‘రామాయణం’ టీమ్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి