ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఇక సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మానవ మృగాలా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది. ఏకంగా అడవుల్లో ఉండే మృగాల కంటే అత్యంత క్రూరంగా మనుషులు ప్రవర్తిస్తున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు నేను నా కుటుంబం బాగుంటే సరిపోతుంది ఎవరు ఎటు పోయిన పర్వాలేదు అని స్వార్ధంగా ఆలోచించేవాడు మనిషి.


 కానీ ఇప్పుడు ఏకంగా సొంత లాభాల కోసం సొంత వారినే దారుణంగా హత్య చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇలా చిన్నచిన్న కారణాలకే దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే ఏ క్షణంలో ఎవరు ఎలా ప్రాణాలు తీస్తారో అన్నది కూడా తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే ఇక్కడ ఇలాంటి ఓ దారుణ వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. షాంపూ కోసం కనీ పెంచిన తల్లిని చంపేశాడు ఇక్కడ కిరాతక కొడుకు.



 ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. షాంపూ కోసం కన్నతల్లిని ఇటుకతో కొట్టి చంపేసాడు. మెదక్ మండలం రాజ్ పల్లిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన 58 ఏళ్ల దేవమ్మతో తన కుమారుడు నారాయణ ఉంటున్నాడు. అయితే నారాయణ ఇటీవల షాంపూ విషయంలో తల్లితో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయి తలపై ఇటుకతో దాడి చేశాడు. ఈ క్రమంలోనే తీవ్ర గాయాల పాలైన సదరు మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అయితే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని నిందితుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: