తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పెరుగుతున్నాయి. గత కొన్నినెలల్లోనే తమకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న వారిని తల్లిదండ్రులు మట్టుబెడుతున్న సంఘటనలు వెలుగు చూశాయి. అయితే.. ఈ పరువు హత్యల్లో ఇప్పుడు ఓ కొత్త కోణం వెలుగు చూస్తోంది. గతంలో ఇలాంటి పరువు హత్యలు ఎక్కువగా ఆస్తులు, అంతస్తులు, కులాల్లో ఎక్కుగా తేడా ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన యువతీ యువకులు ప్రేమ వివాహం చేసుకుంటే జరిగేవి..


ప్రధానంగా తక్కువ కులం అబ్బాయి.. ఎక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. అల్లుడని కూడా చూడకుండా సుపారీ ఇచ్చి మరీ చంపేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్న ఓ బీసీ యువకుడిని అతి దారుణంగా నడిరోడ్డుపైనే చంపేశారు. కొన్నేళ్ల క్రితం నల్గొండలో జరిగిన ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇలాంటి పరువు హత్యలు చాలా కాలంగా జరుగుతున్నాయి. సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా కులం, మతం, ఆస్తులు, అంతస్తులు ఇంకా ప్రేమికులకు అడ్డుగానే ఉన్నాయి.


ఇప్పుడు కనిపిస్తున్న కొత్త ట్రెండ్ ఏంటంటే.. ఇద్దరూ అగ్ర కులాలకు చెందిన వారే అయినా.. ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారే అయినా సరే.. పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే చాలా మంది అంగీకరించడం లేదు. అంటే కులం కంటే కూడా పరువే కీలక పాత్ర వహిస్తుందేమో అనిపిస్తోంది. గతంలో చందానగర్‌ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు అగ్ర కులాలకు చెందిన యువతీయువకులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా.. అల్లుడిని సుపారీ ఇచ్చి మరీ చంపేయించారు.  


తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన యువతీ యువకులు.. ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అయినా.. ఒకే గ్రామానికి చెందిన వారే అయినా.. తమ కుమార్తెను ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు.. యువకుణ్ని యువతి బంధువులు నమ్మించి తీసుకెళ్లి, హతమార్చి మృతదేహాన్ని తగులబెట్టేశారు. అల్లుడు సొంత కులంవాడే అయినా.. ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడనా కూడా ప్రేమ పెళ్లిని అంగీకరించలేకపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: