తెలంగాణలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గాన్ని తెలంగాణలో బీజేపీ అల్రెడీ చేరదీస్తోంది. వారికి ఓట్లు పడే అవకాశం ఉంది. ఆంధ్రలో కాపులంటూ ప్రత్యేకంగా ఆకర్షణకు గురైతే తప్ప బీఆర్ఎస్ కు ఓట్లు పడవు. కాపులు ఐక్యమై బీఆర్ఎస్ కు ఓట్లు వేసినా తెలంగాణలో కాపులు వేస్తారని చెప్పలేం.
అసలు పవన్ కల్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేయడమే రాధాకృష్ణ పని పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు కొందరు. ఎలాగంటే పవన్ కనక తెలుగుదేశంతో కలవకపోతే అమ్ముడు పోయావని చెప్పొచ్చు. ఒక వేళ పవన్ టీడీపీతో కలిసి పోటీ చేసినా వైసీపీ చేసే విమర్శ డబ్బులు తీసుకొని అమ్ముడు పోయాడని అంటారు. టీడీపీతో కలవకపోతే రాధాకృష్ణ చేసిన ఆరోపణ నిజమని చెప్పొచ్చచు. అదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అమ్ముడుపోయాడని విష ప్రచారం చేయడం. టీడీపీతో కలిస్తే వైసీపీ పార్టీ చేసే ఆరోపణలు టీడీపీకి పవన్ అమ్ముడుపోయాడని అంటారు.
పవన్ ను టీడీపీ అల్రడీ పొత్తు పెట్టుకోమని అడుగుతోంది. 58 సీట్లు కావాలని పవన్ అడిగారు. సీఎం పదవిలో షేరింగ్ కావాలని కోరిన విషయం తెలిసిందే. అయితే ఇవేవీ అడగకూడదని రాధాకృష్ణ వేసిన ఎత్తుగడే పవన్ ని కుట్రలో ఇరికించడం.. ప్రజల్లో పవన్ కల్యాణ్ అంటే చులకన కలిగేలా చేయడం అన్న వాదన వినిపిస్తోంది. మరి పవన్ పై వేసిన ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.