ప్రభుత్వం ఈ విషయంలో ఒక్క మున్సిపాలిటీలో కూడా తీర్మానం చేయించలేదని కేటీఆర్ ఆరోపించారు. ప్రజలతో నేరుగా అభిప్రాయం సేకరించలేదు, అఖిలపక్ష సమావేశం పెట్టలేదు శాసనసభలో చర్చ జరపలేదు. ఎవరితోనూ మాట్లాడకుండా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విలీనం దీర్ఘకాలిక ప్రణాళిక కింద కాకుండా కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళారుల ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల ధరలు పెంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టే ఆలోచన వెనుక ఉందని ఆయన ఆరోపించారు. మహా హైదరాబాద్ పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియాకు లాభం చేకూర్చే ప్రణాళిక ఇదని ఆయన ధ్వజమెత్తారు.
ఈ విలీన ప్రతిపాదన వెనుక ఉన్న నిజమైన కారణాలు ఏమిటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజల భవిష్యత్తును రియల్ ఎస్టేట్ లాబీ చేతుల్లో పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన హెచ్చరించారు. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తిస్తోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి