బంగారం వెండి ధరలు ఎలా కొనసాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకు ఈ బంగారం ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. ఇంకా అలాంటి ఈ బంగారం ధరలు కరోనా వైరస్ కారణంగా మరింత పెరిగాయి. కరోనా కారణంగా స్టాక్ మార్కెట్ దారుణంగా కుప్పకూలడం.. ఇంకా ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. 

 

అయితే నేడు బంగారం ధర వంద కాదు రెండు వందలు కాదు.. అతి అతి స్వల్పంగా బంగారం ధర పెరిగింది. ఇంకా నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయిల పెరుగుదలతో 49,220 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 30  రూపాయిల పెరుగుదలతో 45,120 రూపాయలకు చేరింది. 

 

ఇంకా వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 400 రూపాయిల తగ్గుదలతో 50,110 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49 వేలు కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరి బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి.                                                                

మరింత సమాచారం తెలుసుకోండి: