పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.. నిన్న కాస్త నిలకడగా ఉన్న పసిడి ధరలు నేడు మార్కెట్ లో భారీగా పెరిగాయని తెలుస్తుంది.నిన్న మార్కెట్ లో ఉన్న ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు పరుగులు పెడుతున్నాయి.. బంగారం ధరలు పెరిగితే వెండి కూడా అదే దారిలో నడిచింది.. బంగారం కొనాలాని భావించె వారకి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఈరోజు మార్కెట్ లో ధరలు మండి పోతున్నాయి.. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ధరలు భారీగా తగ్గాయని మార్కెట్ నిపుణులు  అంటున్నారు.. ఈరోజు మన దేశం లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము...


హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చుద్దాము..బుధవారం బంగారం ధర పైకి కదిలింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 లు పెరిగింది.. కాగా, ఇప్పుడు పసిడి రేటు రూ. 52,100కు ఎగసింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి రేటు రూ.350 పైకి చేరడంతో రూ. 47,750కు పెరిగింది. బంగారం ధరలు భారీగా పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ.800 పెరిగింది. దాంతో వెండి ధరలు రూ. 73,400కు ఎగసింది. విజయవాడ, విశాఖపట్నంలో అదే ధరలు కొనసాగుతున్నాయి.


ఇవి మన దేశంలో నమోదు అవుతున్న ఈరోజు పసిడి, వెండి ధరలు.. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిసీలిస్తె..మార్కెట్‌లో బంగారం ధర దిగి వచ్చింది. ఔన్స్‌కు 0.06 శాతం క్షీణించింది. ఇప్పుడు బంగారం ధరలు ఔన్స్‌కు 1920 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా అదే దారిలో నడిచింది.. వెండి ధర ఔన్స్‌కు 0.06 శాతం తగ్గుదలతో 24.89 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం గమనార్హం.. బంగారం ధరల పై ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు వంటివి ప్రభావాన్ని చూపిస్తున్నాయి.మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: