మన ఇండియాలో ఆన్ లైన్ మెడికల్ అపాయింట్మెట్లు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. 2022 వ సంవత్సరంలో గతేడాదితో పోలిస్తే మెట్రో నగరాల్లో మొత్తం 75 శాతం ఆన్ లైన్ మెడికల్ అపాయింట్మెట్లు అనేవి పెరిగినట్లు ప్రిస్టిన్ కేర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది.ఇంకా అలాగే ఇదే విధంగా టైర్-2, టైర్-3 నగరాల్లో మొత్తం 87 శాతం పెరిగింది. లైబ్రేట్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్‌లో జరిగిన మొత్తం 11.1 కోట్ల డాక్టర్-పేషెంట్ ఇంటారక్షన్ డేటాను పరిశీలించగా కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఈ ఆన్ లైన్ మెడికల్ అపాయింట్మెంట్ ని కోరుతున్నట్లుగా ఈ పరిశోధనలో తేలింది. 2021 వ సంవత్సరంతో పోలిస్తే 2022 వ సంవత్సరంలో మొత్తం 65 శాతం ఎక్కువ మంది మహిళలు ఆన్‌లైన్ అపాయింట్మెట్లను కోరడం జరిగింది. ఇక ఇలా ఆన్ లైన్ అపాయింట్మెంట్లు కోరుతున్నవారిలో గ్యాస్ట్రోఎంటరాజీ ఇంకా అలాగే ఈఎన్టీ సమస్యలు ఉన్నవారి సంఖ్య మొత్తం 150 శాతం పెరిగింది.


అలాగే చర్మసమస్యలు 125 శాతం ఇంకా అలాగే సైకియాట్రీ అండ్ పీడియాట్రిక్ 110 శాతం అలాగే గైనకాలజీ విభాగంలో మొత్తం 100 శాతం ఆన్ లైన్ అపాయింట్మెంట్లు అనేవి బాగా పెరిగాయి. అలాగే 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఎక్కువగా పిల్లలకు లేదా లైంగిక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల కోసం అపాయింట్మెంట్లుని బుక్ చేసుకోవడం జరిగింది. అలాగే 45 ఏళ్లకు పైబడిన వారు డయాబెటిస్, బీపీ ఇంకా కోవిడ్ తరువాత సమస్యలు, థైరాయిడ్ సంబంధిత సమస్యలకు ఇంకా అలాగే దీర్ఘకాలిక సమస్యలపై ఆల్ లైన్ మెడికల్ సంప్రదింపులను కోరుతున్నారు.అలాగే పురుషుల్లో వయస్సుతో సంబంధం లేకుండా శృంగార సంబంధిత సమస్యలకు ఇంకా మహిళలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్), గర్భం అలాగే ఇర్రెగ్యులర్ పిరియడ్స్ వంటి వాటి సమస్యల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: