మనలో చాలా మంది కూడా పండ్లు తినేప్పుడు కట్ చేసి వాటి ముక్కలపై కారం, ఉప్పు చల్లుకుని తింటారు.ఎక్కువగా మామిడి కాయ, జామకాయలని ఇలా తింటూ ఉంటారు.అయితే ఇలా తినడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు  మనం పూర్తిగా తెలుసుకుందాం.పండ్లపై ఉప్పు కారం చల్లుకుని తినడం వల్ల పండ్ల రుచి పెరగడమే కాదు పండ్లపై ఉండే బ్యాక్టీరియా కూడా ఈజీగా నశిస్తుంది. అయితే అలా అని అన్ని పండ్లముక్కల మీద ఉప్పు కారం చల్లుకుని తినడం కరెక్ట్ కాదు. పండ్ల ముక్కలపై ఉప్పు కారం చల్లడం వల్ల బ్యాక్టీరియాను నాశనం చేయొచ్చు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఏమాత్రం మంచిది కాదు. అయితే.. ఉప్పు ఎక్కువగా చల్లుకుంటే మాత్రం గుండె జబ్బులు ఇంకా కిడ్నీ వ్యాధులు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.అయితే సిట్రస్ జాతి పండ్ల మీద ఉప్పు చల్లుకుని తింటే కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను నిరోధించవచ్చు. దీంతో అజీర్తి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.


జామకాయ మీద ఉప్పు చల్లుకుని తింటే దంతాలకు చాలా మేలు జరుగుతుంది. నోటిలోని బ్యాక్టీరియా కూడా ఈజీగా నశిస్తుంది.  విటమిన్ సి అధికంగా ఉండి పుల్లగా ఉండే పండ్లు లేదా కాయల మీద కాస్త ఉప్పు చల్లి తినవచ్చు. అయితే అది కూడా రోజుకు మనం తినే ఉప్పు మోతాదు మించకుండా ఉండాలి. కేవలం అలాగైతే పండ్ల మీద నిరభ్యంతరంగా ఉప్పు చల్లి తినవచ్చు. అలా కాకుండా కొందరు రోజూ ఉప్పును చాలా ఎక్కువగా తింటుంటారు.అయితే అలాంటి వారు పండ్లపై ఉప్పును చల్లకపోవడమే మంచిది. ఎందుకంటే ఉప్పు ఖచ్చితంగా మోతాదు మించుతుంది. దీంతో చాలా అనర్థాలు సంభవిస్తాయి.కాబట్టి పండ్లపై ఉప్పు చల్లి తినేవారు రోజువారీ కోటాలో కాస్త ఉప్పును తగ్గించి తింటే ఆరోగ్యానికి మంచిది. దీంతో రుచికి రుచి లభిస్తుంది. ఇంకా అలాగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కాబట్టి పండ్లపై ఉప్పు చల్లి తినేవారు ఈ జాగ్రత్తలను పాటించడం చాలా మంచిది.దీంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు.అందువల్ల ఎలాంటి అనర్థాలు కలగకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: